Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : ట్రీనీటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, దోర్నాల పాఠశాలలో చదువుతున్న 5వ మరియు 6వ తరగతి విద్యార్థులు తమ తరగతి గదులలో ఉపాధ్యాయులు బోధించిన నైతిక విలువలతో ప్రభావితమై, తల్లిదండ్రులు వారికి ఇచ్చిన డబ్బులో కొంత పొదుపు చేసుకోని (03- 01- 2026)శనివారం నాడు దోర్నాల పట్టణంలోని నిరుపేద ప్రజలకు చెప్పులు, దుప్పట్లు, స్వెటర్లు, తువ్వాళ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం గురించి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ M. బెన్రాజు గారు విద్యార్థులు ఉపాధ్యాయులచే ప్రభావితమై ఇలాంటి కార్యక్రమాలను పంచుకోవడం మంచి నిర్ణయమని అభినందించారు. కరస్పాండెంట్ k.వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ, భవిష్యత్తులో ట్రినిటీ పాఠశాల విద్యార్థులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా జరగాలనీ వారిలో ఉన్నట్టువంటి ఆలోచన కొనసాగాలని అభిప్రాయం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ పాఠశాల ఉపాధ్యాయులు జాను, జ్యోతి, అరుణ. రీటా మరియు అకౌంటెంట్ తిమోతి పాల్గొన్నారు.
Admin
Mana Mahati News