Saturday, 13 June 2026 11:22:50 AM
# *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

కలం వీరుడికి కన్నీటి వీడ్కోలు..!

కిషోర్ కుమార్ కలం మూగబోయింది

Date : 08 January 2026 06:39 AM Views : 187

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / విజయనగరం : కలం వీరుడికి కన్నీటి వీడ్కోలు..! సమాజ హితానికి అంకితమైన ఒక కిషోర్ కుమార్ కలం మూగబోయింది కలం కదిలితే ఉద్యమం కదిలేది. ఆ కలమే ఈరోజు శాశ్వత నిశ్శబ్దంలోకి వెళ్లింది. హైదరాబాద్ ప్రతినిధి నివాస్ న్యూస్ జనవరి 8: #####################₹############################# అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ కుమార్ అకాల మరణం జర్నలిజం రంగానికే కాదు, సమాజమంతటికీ తీరని లోటుగా మారింది. నీతి, నిజాయితీ, క్రమశిక్షణలకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచిన ఆయన ఇక లేడన్న నిజం కలం వీరులను కన్నీటి పర్యంతం చేసింది.

ఆయన కలం వార్తలకే పరిమితం కాలేదు. జర్నలిజం అంటే బాధ్యత అని, ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన జర్నలిజమని ఆయన జీవితం ద్వారా నేర్పారు. వేలాది మంది జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా నిలిచి, ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి, ఎలా నిలబడాలి, ఎలా సమాజానికి ఉపయోగపడాలి అనే విలువలను నూరిపోశారు. ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా, ఒక్క ఫోన్ కాల్‌తోనే అనేకమందిని చైతన్యపరిచిన గురువు ఆయన. జర్నలిజంతో పాటు హ్యూమన్ రైట్స్ ఉద్యమాల్లో ఆయన సేవలు ఒక ప్రత్యేక అధ్యాయం. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలకు విలువ కట్టారు. సొంత ఖర్చులతో, తన శక్తికి మించిన శ్రమతో, వందకు పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారికి కొత్త జీవితం అందించారు. తన ఆరోగ్యం, తన ప్రాణం కూడా లెక్కచేయకుండా ఇతరుల ప్రాణాల కోసం తపించిన మహోన్నత మనసు ఆయనది. ఈ వార్త తెలిసిన వెంటనే, అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుంచు కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నీలాంటి సేవాభావం, నైపుణ్యం, ఉద్యమస్ఫూర్తి కలిగిన వ్యక్తులు అరుదు. దేవుడు మరో జన్మ ఇస్తే, మళ్లీ కలం వీరుల మధ్యనే పుట్టాలి” అంటూ ఆయన అశ్రునివాళి అర్పించారు.

తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఈ లోటును ఎవరూ పూడ్చలేరు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా సాగిన ఆయన ఉద్యమస్ఫూర్తి రాబోయే తరాలకు దారిదీపమని పేర్కొన్నారు. కొత్త జర్నలిస్టులకు క్రమశిక్షణను ఆయుధంగా, నీతి–నిజాయితీలను ఆత్మగా మలిచిన వ్యక్తి ఆయన. సమాజం కోసం జీవించి, సమాజం కోసమే నడిచిన నిజమైన కలం వీరుడు. ఈ రోజు ఆయన శరీరంగా లేరు. కానీ ఆయన కలం— ఒక ఉద్యమంగా, ఒక ఆదర్శంగా, అనేక హృదయాల్లో ఇప్పటికీ జీవిస్తోంది. వేమన చెప్పిన మాటే ఆయన జీవన తత్వం: “నిజమున పలుక రాదు నీఁకు నిజము విడచి నిలువ రాదు” నిజాయితీనే జీవనంగా మలిచుకున్న ఆ మహోన్నత కలం వీరుడికి కలం వీరుల తరఫున కన్నీటి శ్రద్ధాంజలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన.

Abhinav kumar

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :