Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతులను తండ్రి రాజశేఖర్ (54), కుమార్తె రాజశ్రీ (24)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా అల్లుడు ప్రవీణ్ వారిద్దరినీ చంపినట్లు సమాచారం. సమాచారం అందుకున్న మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు. ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Admin
Mana Mahati News