Saturday, 13 June 2026 11:16:22 AM
# *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # *నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

* *డిజిటల్ అరెస్ట్ పేరుతో అద్దంకిలో భారీ దోపిడీ రిటైర్డ్ బ్యాంకర్ నుంచి రూ. 1.23 కోట్లు మాయం*

Date : 08 January 2026 10:29 PM Views : 138

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *డిజిటల్ అరెస్ట్ పేరుతో అద్దంకిలో భారీ దోపిడీ రిటైర్డ్ బ్యాంకర్ నుంచి రూ. 1.23 కోట్లు మాయం* ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ జనవరి 8 కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమంటూ వీడియో కాల్‌లో బెదిరింపులు - 24 గంటల పాటు బాధితుడిని గృహనిర్బంధంలో ఉంచి సొమ్ము కాజేసిన కేటుగాళ్లు - సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరిక ప్రకాశం జిల్లా అద్దంకి సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో సామాన్యులను, చదువుకున్న వారిని కూడా నిలువునా ముంచేస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారిని లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు, 'డిజిటల్ అరెస్ట్' అనే నయా మోసంతో ఏకంగా రూ. 1,23,00,000 (కోటి ఇరవై మూడు లక్షలు) స్వాహా చేశారు. బాధితుడైన రిటైర్డ్ బ్యాంకర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి వీడియో కాల్ వచ్చింది. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ సిబిఐ అధికారులమని పరిచయం చేసుకున్నారు. "మీ ఆధార్ కార్డు ద్వారా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. తైవాన్ నుండి డ్రగ్స్ పార్శిల్స్ మీ పేరుతో వెళ్లాయి. దీనిపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది" అని భయపెట్టారు. 24 గంటల 'డిజిటల్ అరెస్ట్' నిజమైన అధికారులుగానే నమ్మించిన నేరగాళ్లు, బాధితుడిని తన ఇంట్లోనే ఒక గదిలో ఉండాలని, ఎవరికీ ఫోన్ చేయకూడదని (డిజిటల్ అరెస్ట్) ఆజ్ఞాపించారు. స్కైప్ (Skype) ద్వారా 24 గంటల పాటు ఆయనను వీడియో పర్యవేక్షణలో ఉంచారు. కేసు నుంచి బయటపడాలంటే తమ 'సెక్యూరిటీ అకౌంట్'కు డబ్బు పంపాలని, దర్యాప్తు తర్వాత తిరిగి ఇస్తామని నమ్మబలికారు. దీంతో భయాందోళనలకు గురైన బాధితుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొదుపు మొత్తాన్ని విడతల వారీగా సుమారు రూ. 1.23 కోట్లను వారు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. తర్వాత వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930 సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేరింది.. దీనిపై అద్దంకి సీఐ కేసు ఆప్తు చేస్తున్నారు..

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :