Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరని మంటలు!* అమరావతి నివాస్ న్యూస్ జనవరి 8 అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ చమురు బావిలో సంభవించిన 'బ్లోఅవుట్' ఘటన స్థానిక ప్రజలను ఇంకా భయాందోళనకు గురిచేస్తూనే ఉంది. ఈ నెల 5న ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం నాలుగో రోజు కూడా అదుపులోకి రాలేదు. బావి నుండి అగ్నికీలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. అయితే, ప్రారంభంలో ఉన్న మంటల ఉద్ధృతి ప్రస్తుతం కొంత మేర తగ్గడం ఊరట కలిగించే అంశం. రంగంలోకి దిగిన ఓఎన్జీసీ నిపుణు లు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి కేవలం 10 మీటర్ల దూరం వరకు వెళ్లి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిం చకుండా ఉండేందుకు యం త్రాల ద్వారా నిరంతరం నీటిని జిమ్ముతున్నారు. దీంతో మంటల తీవ్రత తగ్గింది, కానీ పూర్తిగా ఆరలేదు. బావిని శాశ్వతంగా మూసివేసేందుకు విదేశీ నిపుణుల సలహాలు తీసు కుంటున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, స్థానిక ప్రజలు అప్రమత్తం గా ఉండాలని యంత్రాంగం సూచించింది.
Admin
Mana Mahati News