Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* ది. 28-06-2026 ఆదివారం. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అవేర్ హాస్పిటల్ నందు ఈ రోజు జరిగిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదాన్ని ప్రజలలో అవగాహనా కల్పించి, ప్రతి తల్లిదండ్రులు తమ 5 సంవత్సరాల లోపు పిల్లలు అందరిని విధిగా తమ దగ్గరలోని పల్స్ పోలియో కేంద్రానికి తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని కోరినారు. ఈ కార్యక్రమం లో ఆశా వర్కర్లు పిల్లల తల్లిదండ్రులు పిల్లల తో అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
Admin
Mana Mahati News