Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ ఫోటో తీసేయాలని మోదీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారు* *గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కుటుంబ చరిత్ర దేశంలో లేకుండా చేయాలని చూస్తున్నారు* కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జగ్గారెడ్డి. సంగారెడ్డి, డిసెంబర్ 28,నివాస్ న్యూస్....ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని మహాత్మా గాంధీ నేతృత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ.. ఇంకా ఎందరో పెద్దలు దేశ స్వాతంత్రం కోసం శాంతియుత మార్గంలో పోరాటం చేశారు* జవహర్ లాల్ నెహ్రూ కాబినెట్ లో అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రిగా ఉండి, సమస్త కులాలు, సమస్త మతాల ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని రాజ్యాంగం రాసారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 141 ఏళ్లు అవుతున్న సందర్బంగా సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించిన జగ్గారెడ్డి, నిర్మల. స్వాతంత్ర ఉద్యమంలో మోదీ, అమిత్ షా పాత్ర లేదు. స్వాతంత్రం వచ్చినపుడు వారు ఇంకా పుట్టనే లేదు. కానీ జవహర్ లాల్ నెహ్రూ ఏం దేశానికి ఏం చేశారని మోదీ, అమిత్ షా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. దేశ స్వాతంత్రం కోసం జవహర్ లాల్ నెహ్రూ 12 ఏళ్లు జైలు జీవితం గడిపారు. ఈ దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ కూడా జైలుకు వెళ్లారు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి మోదీ, అమిత్ షా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి ఈ దేశప్రజలు సుఖ శాంతులతో బతకాలన్నా, హక్కులు పొందాలన్నా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలి
Admin
Mana Mahati News