Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : ఘనంగా ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్-4లో వార్షిక క్రీడోత్సవం మన మహతి న్యూస్ ఖమ్మం ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్-4లో వార్షిక క్రీడోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. బాల్ బాలెన్సింగ్, రన్నింగ్, వినోదాత్మక క్రీడలు నిర్వహించి పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపారు. పోటీల్లో విజేతలైన రన్నర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్నిస్తాయని,విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని ప్రిన్సిపాల్ రవి తెలిపారు. విద్యార్థుల్లో క్రీడా పోటీ తత్వాన్ని పెంచడానికి ఆటలు దోహదపడతాయని, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అకాడమిక్ చదువులతోపాటు క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా యాజమాన్యం తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన డైరెక్టర్ శ్రీవిద్య,శ్రీధర్,డీజీఎం చేతన్ విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.పి.టి కోఆర్డినేటర్ గౌతమి, పి.పి.టి ఇంచార్జ్ స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
Mana Mahati News