Tuesday, 28 July 2026 04:51:53 PM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

* *జీఎస్టీ సంస్కరణలు దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది*

Date : 28 December 2025 10:03 PM Views : 215

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *జీఎస్టీ సంస్కరణలు దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది* *ఎం. వెంకయ్య నాయుడు* హైదరాబాద్ నివాస్ న్యూస్ డిసెంబర్ 28 డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు వెంకయ్య నాయుడి అభినందన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన జీఎస్టీపై గ్రంథాన్ని హైదరాబాద్‌లోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు నివాసంలో మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావును ఆయన అభినందించారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన, విప్లవాత్మక మార్పులకు నాంది పలికినవని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, అభివృద్ధి అనే అంశాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి జీఎస్టీ సంస్కరణలను విశ్లేషించిన తీరు ఈ గ్రంథానికి ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు. పన్నుల వ్యవస్థలో ఏకీకరణ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడిన విధానం, పారదర్శకత పెరగడం, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కలగడం వంటి అంశాలను ఈ గ్రంథం స్పష్టంగా ప్రతిపాదించిందని తెలిపారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య ఆర్థిక సమన్వయం బలోపేతం కావడంలో జీఎస్టీ పాత్రను కూడా ఈ రచన సమగ్రంగా వివరించిందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణలను కేవలం గణాంకాల పరంగా కాకుండా, ప్రజల జీవితాలతో అనుసంధానిస్తూ సామాజిక కోణంలో విశ్లేషించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా జీఎస్టీపై అవగాహన పెంపొందించడంలో ఈ గ్రంథం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ గ్రంథాన్ని ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆవిష్కరణ అనంతరం ఈ రచనకు లభించిన స్పందన జీఎస్టీ అంశంపై సమాజంలో ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణల ఉద్దేశ్యం, అమలు విధానం, ప్రజలపై వాటి ప్రభావాన్ని సుస్పష్టంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ గ్రంథాన్ని రచించినట్లు తెలిపారు. తన రచనకు ఆశీస్సులు, ప్రోత్సాహం అందించిన వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: