Sunday, 22 March 2026 05:10:24 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

* *జీఎస్టీ సంస్కరణలు దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది*

Date : 28 December 2025 10:03 PM Views : 158

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *జీఎస్టీ సంస్కరణలు దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది* *ఎం. వెంకయ్య నాయుడు* హైదరాబాద్ నివాస్ న్యూస్ డిసెంబర్ 28 డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు వెంకయ్య నాయుడి అభినందన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన జీఎస్టీపై గ్రంథాన్ని హైదరాబాద్‌లోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు నివాసంలో మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావును ఆయన అభినందించారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన, విప్లవాత్మక మార్పులకు నాంది పలికినవని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, అభివృద్ధి అనే అంశాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి జీఎస్టీ సంస్కరణలను విశ్లేషించిన తీరు ఈ గ్రంథానికి ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు. పన్నుల వ్యవస్థలో ఏకీకరణ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడిన విధానం, పారదర్శకత పెరగడం, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కలగడం వంటి అంశాలను ఈ గ్రంథం స్పష్టంగా ప్రతిపాదించిందని తెలిపారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య ఆర్థిక సమన్వయం బలోపేతం కావడంలో జీఎస్టీ పాత్రను కూడా ఈ రచన సమగ్రంగా వివరించిందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణలను కేవలం గణాంకాల పరంగా కాకుండా, ప్రజల జీవితాలతో అనుసంధానిస్తూ సామాజిక కోణంలో విశ్లేషించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా జీఎస్టీపై అవగాహన పెంపొందించడంలో ఈ గ్రంథం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ గ్రంథాన్ని ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆవిష్కరణ అనంతరం ఈ రచనకు లభించిన స్పందన జీఎస్టీ అంశంపై సమాజంలో ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణల ఉద్దేశ్యం, అమలు విధానం, ప్రజలపై వాటి ప్రభావాన్ని సుస్పష్టంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ గ్రంథాన్ని రచించినట్లు తెలిపారు. తన రచనకు ఆశీస్సులు, ప్రోత్సాహం అందించిన వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :