Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యక్ష విక్రయ మహిళా వ్యాపారవేత్తల శిఖరాగ్ర సమావేశం–2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామపంచాయతీకి చెందిన జంధ్యం కనక మహాలక్ష్మి (భర్త: చందులాల్) ప్రతిభ కనబర్చారు. ఆమె గత ఐదేళ్లుగా వెస్టీజ్ ప్రత్యక్ష విక్రయ మార్కెటింగ్ సంస్థలో సేవలు అందిస్తున్నారు. మహిళా సాధికారితకు చేసిన కృషికి గాను ప్రత్యక్ష విక్రయ విభాగంలో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. వినియోగదారుల విశ్వాసం మరియు నిబద్ధతలో విశిష్టతకు గాను భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా "వినియోగదారుల విశ్వాసం మరియు నిబద్ధత విశిష్టత పురస్కారం”ను స్వీకరించారు.
Admin
Mana Mahati News