Saturday, 12 September 2026 08:59:51 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

* *డ్వాక్రా బకాయిలపై సర్కార్ ఉక్కుపాదం.l కట్టకపోతే ఆస్తులు జప్తు!*

Date : 04 January 2026 05:30 PM Views : 205

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *డ్వాక్రా బకాయిలపై సర్కార్ ఉక్కుపాదం.l కట్టకపోతే ఆస్తులు జప్తు!* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 4 స్త్రీనిధి రుణ బకాయిలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం వసూళ్ల కోసం రెవెన్యూ రికవరీ చట్టం అమలుకు ఉత్తర్వులు అప్పు కట్టని వారి ఆస్తులు జప్తు చేసి వేలం వేసే అధికారం సభ్యురాలు కట్టకపోతే గ్రూప్‌లోని అందరిపైనా భారం తెలంగాణలో డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా 'స్త్రీనిధి' ద్వారా రుణాలు పొంది, నెలవారీ వాయిదాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. పేరుకుపోయిన మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 'రెవెన్యూ రికవరీ చట్టాన్ని' అమలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. *ఏమిటీ 'రెవెన్యూ రికవరీ' చట్టం?* ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు ఈ చట్టాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తారు. దీని ప్రకారం రుణం చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసే అధికారం అధికారులకు లభిస్తుంది. ఇళ్లు, భూములు వంటి స్థిరాస్తులతో పాటు ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని, వాటిని బహిరంగంగా వేలం వేస్తారు. ఆ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం తన బకాయి కింద జమ చేసుకుంటుంది. ఈ చట్టం అమలుతో బకాయిదారులపై ఒత్తిడి పెంచి, వసూళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. *జగిత్యాల జిల్లాలో తీవ్రమైన పరిస్థితి* ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 60 వేల మందికి పైగా డ్వాక్రా సభ్యులు ఉండగా, వారికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 475 కోట్ల రుణాలు అందించింది. చాలామంది మహిళలు తమ వ్యాపారాల కోసం రూ. 30 వేల నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. అయితే, జిల్లాలో వసూలు కావాల్సిన రూ. 101 కోట్లకు గాను కేవలం రూ. 78 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దాదాపు రూ. 23 కోట్లు మొండి బకాయిలుగా పేరుకుపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. *ఒక్కరు కట్టకపోయినా అందరికీ చిక్కులు!* ఈ చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. రుణం తీసుకున్న సభ్యురాలి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోతే, ఆ అప్పును తీర్చే బాధ్యత గ్రూప్‌లోని మిగిలిన సభ్యులపై పడుతుంది. అంటే, ఒకరు చేసిన పొరపాటుకు సంఘంలోని అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. అవసరమైతే ఇతర సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేసేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో, సంఘంలోని మహిళలు పరస్పర సహకారంతో సకాలంలో రుణాలు చెల్లించేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే సెర్ప్, మెప్మా అధికారులు గ్రామాల్లో పర్యటించి బకాయిల చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు డీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి కూడా అనుమతులు రావడంతో, త్వరలోనే జప్తు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :