Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలు!* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 7 తెలంగాణలోని వివిధ చోట్ల పలువురు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అక్కవరపు కిరణ్ కుమార్,ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాగ్ అంబర్ పేట్ దేవాదాయశాఖకు చెందిన భూమికి సర్వే రిపోర్టు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు బాధి బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు నుంచి రూ 1,50,000 డిమాండ్ చేసి మొదటి విడతగా 50వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీవో సుమతి, ఏపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి కార్యదర్శి చెన్నయ్యలు ఒకేసారి ముగ్గురు లంచగొండి అధికారులు పట్టుబడడం సంచలనంగా మారింది.. ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్, వారిని అరెస్టు చేశారు.
Admin
Mana Mahati News