Sunday, 13 September 2026 10:36:19 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*నిజం చెప్పే ధైర్యం లేని వ్యక్తులు సమాజానికి పెద్ద ముప్పు.”...*

Date : 10 March 2026 11:18 PM Views : 209

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *Press Note:* “నిజం చెప్పే ధైర్యం లేని వ్యక్తులు సమాజానికి పెద్ద ముప్పు.” ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరిగేవారు నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేని వారు. తమ తప్పులను ఒప్పుకోవడం రాక, బాధ్యత తీసుకోవడం రాక, అబద్ధాల వెనుక దాక్కొని బ్రతకడం వారి అలవాటుగా మారిపోతుంది. ఇలాంటి వ్యక్తులు తమ బలహీనతను దాచుకోవడానికి ఎన్నో మార్గాలు వెతుకుతారు. కానీ నిజం ఒక రోజు బయటపడకుండా ఉండదు. నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఎంత ఎక్కువైతే, వారి వ్యక్తిత్వ పతనం అంత స్పష్టంగా కనిపిస్తుంది. నిజమైన ధైర్యం ఉన్న వ్యక్తి చేసిన పనికి సమాధానం చెబుతాడు. తప్పు జరిగితే దాన్ని ఒప్పుకుంటాడు. అదే నిజమైన ధైర్యం, అదే నిజమైన పౌరుషం. ఆత్మగౌరవం ఉన్న మనిషి ప్రశ్నల నుండి పారిపోడు. కానీ సిగ్గు, బాధ్యత, నైతికత లేని వారు మాత్రం సమాజంలో తిరుగుతూ, మాట తప్పిస్తూ, తమ నీచత్వాన్ని తామే బయటపెడుతుంటారు. "చివరికి సమాజం గౌరవించేది అబద్ధం చెప్పేవారిని కాదు – నిజం కోసం నిలబడే వారినే. నిజం నుండి పారిపోవడం పిరికితనం. నిజం ముందు నిలబడటమే నిజమైన పౌరుషం." –డా. పీటర్ నాయక్ లకావత్, (ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్)

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :