Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : హైదరాబాద్: హైదరాబాద్లోని బండ్లగూడ డిప్యూటీ విద్యా కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శివ ప్రసాద్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫిర్యాదికి చెందిన పాఠశాలను ఎస్ఎస్సీ బోర్డు పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తొలగించకుండా ఉండేందుకు అధికారిక పని చేసిపెట్టే నిమిత్తం ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన శివ ప్రసాద్, అదే కార్యాలయంలో ఆ మొత్తం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లంచం అడిగితే వెంటనే సమాచారం ఇవ్వండి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు. సంప్రదింపు వివరాలు: ???? టోల్ ఫ్రీ నెంబర్: 1064 ???? వాట్సాప్: 9440446106 ???? ఫేస్బుక్: Telangana ACB ❌ ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB ???? వెబ్సైట్: acb.telangana.gov.in ఫిర్యాదుదారులు మరియు బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Admin
Mana Mahati News