Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ప్రేమలో మోసం… యువతి ఆత్మహత్య* ఓ యువతిని ప్రేమించి మోసం చేసిన ఘటన విషాదానికి దారితీసింది. మనస్తాపం చెందిన యువతి ఉరేసుకుని ఆత్మహ*త్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. అయితే ఇటీవల పెళ్లి చేసుకుందామని మమత కోరగా… మత్స్యగిరి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత ఆత్మహ*త్యకు పాల్పడినట్లు సమాచారం. ఆదివారం మమత తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లగా, ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాను ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పేర్కొంటూ మమత ఒక నోట్ రాసింది. అనంతరం సోదరికి ఫోన్ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహ*త్య చేసుకుంది. బావి వద్ద నుంచి ఇంటికి వచ్చిన మమత సోదరి భవాని… ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. #YadadriBhuvanagiri #Telangana
Admin
Mana Mahati News