Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : కేంద్ర బడ్జెట్లో దివ్యాంగులకు తీరని అన్యాయం ₹300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీ అర్ డి ఏ ఇండియా ) గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార్.... 05 ఫిబ్రవరి, 2026 మహతి న్యూస్ ప్రతినిధి:- కేంద్ర బడ్జెట్లో దివ్యాంగులకు తీరని అన్యాయం ₹300 పింఛన్ మోదీ ప్రభుత్వానికి సిగ్గుచేటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీ అర్ డి ఏ ఇండియా ) గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార నరేంద్ర మోదీ ₹300 రూపాయలతో ఒక పూట భోజనం కూడా రాని పరిస్థితి ఉంటే.. నెల మొత్తానికి దివ్యాంగుడికి ఇచ్చే పింఛన్ ₹300 ఏంటి? ఇది దివ్యాంగులపై చూపిస్తున్న జాలియా లేక అవహేళన?" అని ఎన్ పి ఆర్ డి ఏ ఇండియా గిసుకొండ మండల్ అధ్యక్షులు సౌరం సంగీత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2026-27పై ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2012 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 14 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 'ఇందిరా గాంధీ జాతీయ దివ్యాంగుల పింఛన్' కేవలం ₹300 వద్దే ఆగిపోయింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వానికి, దేశంలోని కోట్లాది మంది దివ్యాంగులకు కనీసం ₹5,000 పింఛన్ ఇచ్చే మనసు లేదా? బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమ శాఖకు కేటాయింపులు పెంచామని చెప్పుకోవడం పచ్చి అబద్ధం. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు కేవలం పాత వాటికి పేర్లు మార్చినవే తప్ప, క్షేత్రస్థాయిలో దివ్యాంగుల బతుకులు మార్చేవి కావు. 'వికసిత్ భారత్' అని గొప్పలు చెప్పుకునే మీరు, దివ్యాంగులను 'అంధకార భారత్' లోకి నెట్టేస్తున్నారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం మాకు అందాల్సిన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం నిధుల కేటాయింపులో కేంద్రం కోత విధించడం దుర్మార్గం. జనాభాలో గణనీయంగా ఉన్న దివ్యాంగులకు బడ్జెట్లో 1% నిధులు కూడా కేటాయించకపోవడం మీ వివక్షకు పరాకాష్ట వెంటనే కేంద్రం తన వాటా పింఛన్ను ₹5,000లకు పెంచాలి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరినీ ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అని హెచ్చరించారు....
Admin
Mana Mahati News