Saturday, 12 September 2026 09:11:41 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం*

Date : 21 January 2026 06:37 PM Views : 211

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* సికింద్రాబాద్ | తిరుమలగిరి, జనవరి 21: సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచింది. పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలుడు తల్లి కళ్లముందే మృత్యువును ఆలింగనం చేసుకోవడం హృదయాలను కలచివేసింది. ఆర్కేపురం వంతెన నుంచి తల్లి తన కుమారుడిని స్కూటీపై పాఠశాలకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై స్కూటీ అదుపుతప్పడంతో తల్లి–బాలుడు ఇద్దరూ కిందపడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్మీ వాహనం కిందపడ్డ బాలుడి పైనుంచి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రమాద తీవ్రత స్పష్టంగా బయటపడింది. బాలుడిని కాపాడలేకపోయిన తల్లి పరిస్థితి అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తల్లికీ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్మీ వాహనం వేగం, రోడ్డు పరిస్థితులు, భద్రతా చర్యల్లో లోపాలపై విచారణ జరుపుతున్నారు. పాఠశాలల సమీపంలో వేగ నియంత్రణతో పాటు కఠిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలన్న డిమాండ్ ఈ ఘటనతో మరింత బలపడుతోంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణాలను బలిగొనడమే కాకుండా, ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేసింది.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: