Saturday, 12 September 2026 09:00:21 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*అమెరికానే కాదు ఇండియా స్టాక్ మార్కెట్లకూ ట్రంప్ గండం!..*

Date : 21 January 2026 06:41 PM Views : 257

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : అమెరికానే కాదు ఇండియా స్టాక్ మార్కెట్లకూ ట్రంప్ గండం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ కోసం యూరప్ దేశాలపై ప్రకటించిన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. గ్రీన్‌లాండ్ విక్రయంపై చర్చలకు నిరాకరిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాల నుండి వచ్చే దిగుమతులపై ఫిబ్రవరి 1 నుండి 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభావం నేరుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికాలోని వాల్ స్ట్రీట్ భారీగా నష్టపోయింది. S&P 500 సూచీ అక్టోబర్ తర్వాత అతిపెద్ద పతనాన్ని నమోదు చేయగా, డౌ జోన్స్ ఏకంగా 870 పాయింట్లు పడిపోయింది. ఎన్విడియా, ఆపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఐరోపా దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా బేర్ మన్నాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది. వాల్ స్ట్రీట్‌లో అలజడి మొదలైనప్పుడు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని, సురక్షితమైన ఆస్తులైన బంగారం లేదా అమెరికా డాలర్ వైపు మళ్లుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. దీనివల్ల నిఫ్టీ, సెన్సెక్స్ వంటి భారత సూచీలు భారీగా నష్టపోతున్నాయి. ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల భారత ఐటీ , ఫార్మా రంగాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారత ఐటీ కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అక్కడ దిగుమతి సుంకాలు పెరిగినా లేదా వీసా నిబంధనలు కఠినతరం చేసినా భారత కంపెనీల ఆదాయం తగ్గిపోతుంది. దీనికి తోడు, అమెరికా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ క్షీణించడం భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతోంది. ప్రస్తుతం మార్కెట్లను శాసిస్తున్న ప్రధాన అంశం మాత్రం ట్రంప్ ఫ్యాక్టర్ అనడంలో సందేహం లేదు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :