Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక. 15.03.26 పగడాల కిషోర్ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం గత 17సంవత్సరలుగా అయ్యప్ప, భవాని, శివ, మాలదారులకు ప్రతి సంవత్సరం 80 రోజులు నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఖమ్మం జిల్లా వాసి అయినటువంటి శ్రీ శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి గారికి రాష్ట్ర జాతీయ కమిటీ వారు ఈ పదవిని అప్పగించారు. నా ప్రాణం ఉన్నంతవరకు మాల ధారణ చేసిన ప్రతి వ్యక్తికి 80 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తానని ప్రతిజ్ఞ భూమి ఎన్నో ఎడుదులుకులు ఎదురైనా బెదరక ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న రాంప్రసాద్ గురుస్వామి వారికి ఈ పదవి తగ్గటం జిల్లా వాసుల్లో ఆనందం నిండింది. అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు రాజ్ దేశ్ పాండే మాట్లాడుతూ ఓ గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని ఈ ఎన్నిక మనం ఎన్నుకున్నది కాదని స్వయానా అయ్యప్ప స్వామియే ఎన్నుకున్నారని, ఇంకా ఎంతోమందికి సేవ చేసే మార్గం ఆ అయ్యప్ప చూపించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీమ నరేందర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం నిత్య అన్నదానం నిర్వహిస్తున్న రాంప్రసాద్ గురుస్వామి లాంటి గొప్ప వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా భావిస్తున్నామని, ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించి తమ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారు కోరారు. అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా గౌరవ సలహాదారు పగడాల కిషోర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ పొంది నిత్యం అయ్యప్ప నామ స్మరణతో ఉండే శ్రీ తాండ్ర రాంప్రసాద్ గారు నిత్యం అయ్యప్ప మాలదారుల భిక్ష కోసం తాపత్రయపడే ఓ గొప్ప మనసున్న మహానుభావులు మన ఖమ్మం జిల్లాలో ఉండటం మన ఖమ్మం జిల్లా వాసుల అదృష్టంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నిత్యం వందలాది వేలాది మందికి నిత్య అన్నదానం చేస్తూ ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తూ ముందుకు కొనసాగిస్తున్న గురువుగారికి ఖమ్మం జిల్లా తరఫున పాదాభివందనాలు. ఈ కార్యక్రమన్ని పగడాల కిషోర్ గారు ఆధ్వర్యం లో తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి గారు ABADPS స్టేట్ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ABADPS జాతీయ అధ్యక్షులు రాజ్ దేశపాండే గారు, వాసు గురుస్వామి, నాగ రమాచారి, కట్టా నరసింహారావు,యాసా దీపా, చండీప్రియా, గోపాలరెడ్డి, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News