Mana Mahati News - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : *ఐ ఎన్ టి ఎస్ ఓ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం.* స్థానిక ముస్తఫా నగర్ శ్రీ చైతన్య లోటస్ బ్రాంచ్ నందు 138 మంది విద్యార్థులు విజయాలు సాధించారని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ విజేతలకు మొదటి బహుమతి గాను ట్యాబ్ మరియు గోల్డ్ మెడల్ మెరిట్ సర్టిఫికెట్ని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. మిగతా విద్యార్థిని విద్యార్థులకు మెడల్ మరియు మెరిట్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. ఈ ఫలితాలను చూసినటువంటి శ్రీ చైతన్య పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య గారు చైర్మన్ శ్రీధర్ గారు, డిజిఎం చేతన్ మాధుర్ గారు, విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఫలితాల సాధనలో శ్రీ చైతన్య విద్యార్థులు ఎప్పుడు ముందుంటారని వారి కృషి అంకితభావం శ్రీ చైతన్య కరికులం వారిని ఉన్నత స్థాయిలో నిల్చోబెడుతుందని డైరెక్టర్ శ్రీవిద్య గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కృష్ణారావు గారు పాఠశాల డీన్ ప్రవీణ్ గారు ప్రైమరీ ఇన్చార్జ్ వినీత గారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజేతలను కరతాల ధ్వనులతో అభినందించారు.
Admin
Mana Mahati News