Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : కొప్పుల రామారావు తల్లి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దామాల సర్వయ్య ఖమ్మం జిల్లా బ్యూరో/ ఫిబ్రవరి 14 కొప్పుల రామారావు తల్లి దశదిన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దామాల సర్వయ్య పాల్గొని మరణించిన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా దామాల సర్వయ్య మాట్లాడుతూ, తల్లిదండ్రులు కుటుంబానికి ఆత్మబలం, ఆదర్శమని పేర్కొన్నారు. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులపై ఉంటాయని, ఇలాంటి విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. సమాజం ఎప్పుడూ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి జాకబ్, ప్రముఖ జర్నలిస్ట్ యలమందల జగదీశ్,ఇంచార్జి దామాల సత్యం, నంగరా బేరి రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ భద్రు నాయక్,అడ్వకేట్ ప్రభుత్వ ,పిపి కొట్టే అజయ్ కుమార్,బండి కుమార్,భారత్,మండల నాయకులు వెంకన్న, రామారావు, వరద సాయి తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News