Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా. మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్ ల సాధారణ ఎన్నికల 2026లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆలియాబాదు, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ సెంటర్లు ఎన్నికల సాధారణ పరిశీలకులు కొర్ర లక్ష్మి ఐఎఎస్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. శుక్రవారంరోజున మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీలలో ఎన్నికల నియమావళి ననుసరించి స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత ఆర్ఓలను పరిశీలకులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్ట్రాంగ్ రూంల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు, కౌంటింగ్ సెంటర్లలో కౌంటింగ్ టెబుళ్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాల పై పలు సలహాలు సూచించారు. సెంటర్ల వద్ద తగిన బందోబస్తుతోపాటు స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర పర్యవేక్షణకు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు సాంబశివరావు, సుగుణబాయి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News