Mana Mahati News - తెలంగాణ / ములుగు : *మేడారం ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు – కట్టుదిట్టమైన భద్రతతో భక్తులకు సాఫీ దర్శనం* ములుగు నివాస్ న్యూస్ డిసెంబర్ 28 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఒక వైపు ఆలయ నిర్మాణ పనులు మరో వైపు భక్తుల దర్శనం పక్కా ప్రణాళికతో ట్రాఫిక్ క్లియరెన్స్, క్రౌడ్ నిర్వహణ వరంగల్ నివాస్ న్యూస్ డిసెంబర్ 28 మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయానికి జాతరకు నెలరోజుల ముందే ఈ ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ములుగు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకాన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, అదనపు ఎస్పీ (OSD) శివమ్ ఉపాధ్యాయ, అదనపు ఎస్ పీ సదానందం, ఏఎస్పీ మనన్బట్, డీఎస్పీ ములుగు, జిల్లాలోని అన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు బందోబస్తులో పాల్గొన్నారు.
Admin
Mana Mahati News