Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *రూ. 20 లంచం కేసులో 30 ఏళ్ళు న్యాయ పోరాటం.... చివరికి నిర్దోషిగా విడుదలై కన్నుమూత...* గుజరాత్కు చెందిన మాజీ కానిస్టేబుల్ బాబు భాయ్ ప్రజాపతి కథ విషాదాంతమైంది. కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఆయన 30 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. 2003లో కింది కోర్టు శిక్ష విధించగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత, ఈ నెల 4న ఆయన నిర్దోషి అని కోర్టు తేల్చింది. "నాపై పడ్డ ముద్ర తొలగిపోయింది, ఇక చనిపోయినా పర్వాలేదు" అని సంతోషపడిన ఆయన, విడుదలైన మరుసటి రోజే వృద్ధాప్యంతో కన్నుమూశారు.
Admin
Mana Mahati News