Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *పత్రిక ప్రకటన* *మరిపెడ* *రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇటుకల గడ్డ తండా అంగన్వాడీ కేంద్రంలో చదివే చిన్నారుల మరణం ఇప్పటికీ చర్యలు శూన్యం లంబాడీల ఐక్య వేదికను ఆశ్రయించిన బాధిత కుటుంబాలు* *జనవరి 31 న లంబాడీల ఐక్య వేదిక అధ్వర్యంలో ఇటుకల గడ్డ తండా కు రానున్న నిజ నిర్ధారణ కమిటీ* బాధిత కుటుంబాలకు అండగా ఉంటాము నిజ నిర్ధారణ కమిటీ తో ఇటుకల గడ్డ తండా ను సందర్శిస్తాము - దేవేందర్ నాయక్ గూగులోత్ లంబాడీల ఐక్య వేదిక మండల అధ్యక్షులు రాష్ట్రం లో సంచలనం సృష్టించిన చిన్నారుల మరణం పై లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన వినతులకు స్పందించి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఇటుకల తండా, గిరిపురం గ్రామము, మరిపెడ మండలం, డోర్నకల్ నియోజక వర్గం కు రానున్న జాతి నిజ నిర్ధారణ కమిటీ. చిన్నారుల మరణం పై రాష్ట్ర కమిటీ నిజ నిర్ధారణ కమిటీ వేయడాన్ని స్వాగతిస్తూ ఈ నెల 31 వ తారీకున అనగా శనివారం రోజున వస్తున్న రాష్ట్ర కమిటీ కి మరిపెడ మండలం కేంద్రం లో ఉన్న లంబాడీల ఐక్య వేదిక నియోజక కార్యాలయం నుండి అందరూ కలిసి తండా కు నిజ నిజాలు తెలుసుకునే క్రమం లో మండలం లో ఉన్న లంబాడీల ఐక్య వేదిక నాయకులు, జాతి నాయకులు, కుల సంఘాల నాయకులు ,ప్రజా సంఘాల నాయకులు అందరూ రావాలని మరిపెడ మండల లంబాడీల ఐక్య వేదిక అధ్యక్షులు పిలుపు ఇచ్చారు. నిత్య శ్రీ భూక్య మరియు చైత్ర భూక్య ల కుటుంబాలను కలిసి జరిగిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం లో భాగముగా రాష్ట్ర కమిటీ ఇటుకల గడ్డ తండా కు వస్తున్నారు అని దేవేందర్ నాయక్ తెలియ చేశారు. నవంబర్ 29 న చిన్నారి చైత్ర భూక్య చనిపోవడం జరిగింది అలాగే డిసెంబర్ 18 న చిన్నారి నిత్య శ్రీ చనిపోవడం జరిగింది అనే విషయాలను తెలియ చేస్తూ దరిదాపు 60 రోజులు కావస్తున్న కూడా వారి మరణానికి కారణాలు తెలియ రాలేదు అన్న విషయాన్ని దేవేందర్ నాయక్ గుర్తు చేశారు. ఈ కార్య క్రమం లో బాణోత్ సాయి నాయక్, బానోతు సంతోష్ నాయక్, గుగులోత్ నవీన్ నాయక్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు
Admin
Mana Mahati News