Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కూలీలైన్ మసీదు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు ముగించిన అనంతరం ప్రార్థనలు నిర్వహించి, సామూహికంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సోదరభావం, ఐక్యతను ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. కార్యక్రమంలో మోమిత్,జుబ్బు,అబ్బు, టాపిక్,మున్నా,షోయబ్, సైద్, యాసీన్ పాషా, సోను, అఖిల్, సమీర్,అలీమ్, సోహెబ్ తదితరులు పాల్గొన్నారు. యూత్ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
Mana Mahati News