Sunday, 22 March 2026 03:48:20 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

*నాగారంలో అమానవీయ ఘటన: భార్యాబిడ్డలను రోడ్డుపైకి గెంటేసిన భర్త*

Date : 29 December 2025 09:35 PM Views : 873

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *నాగారంలో అమానవీయ ఘటన: భార్యాబిడ్డలను రోడ్డుపైకి గెంటేసిన భర్త* అక్రమ సంబంధం అడిగినందుకే వేధింపులు.. కోర్టులో కేసు ఉండగానే ఇల్లు అమ్మకం తల్లి, కూతురి రోదన.. బాధితులకు అండగా నిలిచిన కాలనీవాసులు, రాజకీయ నేతలు నివాస్ న్యూస్ / మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం, డిసెంబర్ 29 కట్టుకున్న భార్య అని చూడకుండా, వికలాంగుడైన కొడుకు, కూతురు ఉన్నారన్న జాలి లేకుండా ఓ వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించిన ఘటన మేడ్చల్ జిల్లా నాగారం డివిజన్ రవీంద్ర నగర్ కాలనీలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యాబిడ్డలను బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది? రవీంద్ర నగర్ కాలనీ (ప్లాట్ నెం. 7)లో నివాసం ఉంటున్న వీరన్న నాయక్ ఎన్‌ఎఫ్‌సీ (ఎన్ ఎఫ్ సి)లో ఉద్యోగి. ఆయనకు భార్య అమల బాయి, ఒక కూతురు, వికలాంగుడైన కొడుకు ఉన్నారు. భార్య అమల బాయి తెలిపిన వివరాల ప్రకారం.. వీరన్న నాయక్ గత కొంతకాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనిని ప్రశ్నించినందుకు భార్యాబిడ్డలను వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరి మధ్య విడాకులు, మెయింటెనెన్స్ మరియు ఇంటిపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎవరూ లేని సమయంలో ఇంటిపై దాడి కేసు కోర్టులో ఉండగానే, ఎవరికీ తెలియకుండా వీరన్న నాయక్ తన ఇంటిని వేరొకరికి అమ్మేశాడు. సోమవారం మధ్యాహ్నం అమల బాయి పనికి వెళ్లిన సమయంలో, వీరన్న నాయక్ భారీ సంఖ్యలో మహిళలను తీసుకువచ్చి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న సామాన్లు, వంట పాత్రలు, బట్టలను నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేశారు. తనను, తన వికలాంగ కొడుకును బయటకు గెంటేయడంపై బాధితురాలు మీడియా ముందు కన్నీరుమున్నీరైంది. అండగా నిలిచిన నాయకులు.. సామాన్లు తిరిగి ఇంట్లోకి.. ఈ విషయం తెలుసుకున్న నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, అన్నం రాజు సురేష్, నాయకులు సాయినాథ్ గౌడ్, రవీందర్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున కాలనీవాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసహాయ స్థితిలో ఉన్న తల్లి, కూతుర్లను చూసి వారు చలించిపోయారు. కోర్టులో కేసు ఉండగా ఇలాంటి దౌర్జన్యం చేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. కాలనీ యువకులు, నాయకులు ఐక్యంగా నిలబడి, అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వారిని బయటకు పంపించి, రోడ్డుపై ఉన్న సామాన్లను తిరిగి ఇంట్లోకి చేర్చారు. కాలనీవాసుల దిగ్భ్రాంతి గత పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్న కుటుంబాన్ని ఇలా రోడ్డు పాలు చేయడంపై నాగారం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఒక ఆడపిల్ల అని, వికలాంగ అబ్బాయి అని చూడకుండా భర్త చేసిన ఈ పనిని కాలనీవాసులు తీవ్రంగా ఖండించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :