Wednesday, 29 July 2026 07:35:46 PM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...*

Date : 11 January 2026 01:21 PM Views : 208

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...* యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో గుప్తనిధుల కోసం దేవుడి విగ్రహం కింద తవ్వకాలు చేసిన ఘటన కలకలం రేపింది. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో సాగిన ఈ అక్రమ తవ్వకాలను పోలీసులు అడ్డుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల మాదాపూర్ గ్రామ పరిధిలోని కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమికి ఈసీఐఎల్‌కు చెందిన పులి కుమార స్వామిని సూపర్‌వైజర్‌గా నియమించాడు. అయితే నెలసరి వేతనం సరిపోవడం లేదని భావించిన కుమార స్వామి, ఈజీ మనీ కోసం గుప్తనిధులపై కన్నేశాడు. వ్యవసాయ భూమిలో ఉన్న చిన్న గుట్టపై ఆంజనేయ స్వామి విగ్రహం ఉండటంతో, దాని కింద గుప్తనిధులు ఉంటాయని అతడు నమ్మాడు. ఈ ఆలోచనతో విజయవాడకు చెందిన రామినేని కృష్ణా కిషోర్, పాబోలు శ్రీనివాస్, ఆకుల నరసింహ రావు, ఖమ్మంకు చెందిన తాత కృష్ణకాంత్, బొమ్మల రామారంకు చెందిన వేణులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రచారం చేస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించి హిటాచీ సహాయంతో తవ్వకాలు చేపట్టారు. అయితే గ్రామస్థులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించిన హిటాచీ యంత్రం, కారు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో గుప్తనిధుల తవ్వకాలు చేయడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. గుప్తనిధుల పేరుతో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: