Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అల్లూరి సెంటర్ పాల్వంచ నందు రేపే వైకుంఠ ఏకాదశి కార్యక్రమం మరియు సుదర్శన సహిత లక్ష్మీనరసింహ హోమం* నివాస్ న్యూస్ ప్రతినిధి పాల్వంచ: పాల్వంచ పట్టణం అల్లూరి సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు రేపు అనగా 30వ తారీకు మంగళవారం ఉదయం 3గంటలకు అభిషేకం సహస్రనామార్చన సేవా కాలము 5 గంటలకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం,తీర్థప్రసాద గోష్టి జరుగుతుంది అదేవిధంగా రాత్రి 7 గంటలకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమం జరుగుతుందని ఆలయ అర్చకులు గొడవర్తి రంగనాథ ఆచార్యులు,గొడవర్తి రవికుమార్ ఒక ప్రకటన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గొడవర్తి రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ డిసెంబర్ 16వ తారీకు నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయని ఈ పూజా కార్యక్రమాలు జనవరి 14వ తారీకు వరకు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని అందులో భాగంగా 30వ తారీకు వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) పురస్కరించుకుని రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు కళ్యాణ వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తదుపరి స్వామి వారి యొక్క దర్శనము తదనంతరము స్వామివారికి హారతి నిరాజనం,మంత్రపుష్పం ఉంటాయి అని అదే విధంగా సాయంత్రము ఏడు గంటలకు సుదర్శన సహిత లక్ష్మీనర సింహ హోమం జరుగుతుందని ఈ హోమం అత్యంత శక్తివంతమైన దని ఈ హోమంలో పాల్గొన్న వారికి శతృ నివారణ, దుష్ట దోష నివృత్తి,ఇంటిలో శ్రేయస్సు పెరుగుతుందని ఇందులో పాల్గొనేటటువంటి భక్తులకు ప్రత్యేక ఆశీర్వచనం మరియు సుదర్శన హోమం ప్రసాదం ఇవ్వబడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన దంపతులు గాని భక్తులు గాని సాయంత్రం 6:30 కల్లా విచ్చేయవలసిందిగా తెలియజేశారు.
Admin
Mana Mahati News