Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : డ్రగ్స్కు అడ్డుకట్టలో డఫోడిల్స్ పాఠశాల ముందడుగు యువతలో చైతన్యం పెరిగితేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది --తెలంగాణ మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో) డీఎస్పీ సైదులు కోయ్యాల పిలుపు..! 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత – డ్రగ్స్కు అడ్డుకట్ట” అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం డ్రగ్స్కు నో చెప్పే ధైర్యం యువతలో ఉండాలి - నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ నర్సంపేట: యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టే మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ నర్సంపేటలోని డఫోడిల్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “పిల్లల భద్రత – డ్రగ్స్కు అడ్డుకట్ట” అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి టీజీఎన్ఏబీ డీఎస్పీ సైదులు కోయ్యాల, నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్, సీఐ ఎం. శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ నరేష్, మున్సిపల్ కమిషనర్ కట భాస్కర్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా డీఎస్పీ సైదులు కోయ్యాల మాట్లాడుతూ డ్రగ్స్ ఒక క్షణిక మత్తు మాత్రమే ఇస్తుందని, కానీ జీవితాంతం బాధను మిగులుస్తుందని హెచ్చరించారు. యువతలో చైతన్యం పెరిగితేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలు వంటి సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే డ్రగ్స్పై అవగాహన కల్పించడం అవసరమని, విద్యతో పాటు మానవ విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు పాఠశాలలో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్, డీన్ ఇందుమతి, ప్రధానోపాధ్యాయులు అజీముద్దీన్, ఉప ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. రీటా, హెచ్ఆర్డీ విజయలక్ష్మి, శశికళ తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News