Sunday, 22 March 2026 03:48:14 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

*డ్రగ్స్‌కు అడ్డుకట్టలో డఫోడిల్స్ పాఠశాల ముందడుగు యువతలో చైతన్యం పెరిగితేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది,.*

Date : 10 March 2026 11:24 PM Views : 80

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : డ్రగ్స్‌కు అడ్డుకట్టలో డఫోడిల్స్ పాఠశాల ముందడుగు యువతలో చైతన్యం పెరిగితేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది --తెలంగాణ మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో) డీఎస్పీ సైదులు కోయ్యాల పిలుపు..! 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట” అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం డ్రగ్స్‌కు నో చెప్పే ధైర్యం యువతలో ఉండాలి - నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ నర్సంపేట: యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టే మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ నర్సంపేటలోని డఫోడిల్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట” అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి టీజీఎన్ఏబీ డీఎస్పీ సైదులు కోయ్యాల, నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్, సీఐ ఎం. శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ నరేష్, మున్సిపల్ కమిషనర్ కట భాస్కర్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా డీఎస్పీ సైదులు కోయ్యాల మాట్లాడుతూ డ్రగ్స్ ఒక క్షణిక మత్తు మాత్రమే ఇస్తుందని, కానీ జీవితాంతం బాధను మిగులుస్తుందని హెచ్చరించారు. యువతలో చైతన్యం పెరిగితేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలు వంటి సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే డ్రగ్స్‌పై అవగాహన కల్పించడం అవసరమని, విద్యతో పాటు మానవ విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు పాఠశాలలో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్, డీన్ ఇందుమతి, ప్రధానోపాధ్యాయులు అజీముద్దీన్, ఉప ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. రీటా, హెచ్‌ఆర్‌డీ విజయలక్ష్మి, శశికళ తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :