Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *నూతన ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం* హైదరాబాద్ నివాస్ న్యూస్ ప్రతినిధి జనవరి 1 ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బజ్జుర్ల శ్రీనివాస్ ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రామం నుంచి దేశం దాకా ప్రజలంతా, ముఖ్యంగా రైతులు సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న 2026 సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అందించాలని, సమాజంలో శాంతి–సౌభ్రాతృత్వం బలపడాలని పేర్కొన్నారు. గత ఏడాది కష్టాలను అధిగమించి, నూతన సంవత్సరంలో నూతన శోభతో, ఉత్తేజంతో ప్రజలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి రోజు ఆశతో మొదలై, ప్రతి అడుగు విజయంగా మారాలని ఆయన అభిలషించారు. ఈ సందర్భంగా, నూతన సంవత్సరం ప్రతి ఇంట ఆనందాన్ని నింపి, ప్రతి మనసుకు ఆశను అందించాలని ఆయన ఆకాంక్షించారు.
Admin
Mana Mahati News