Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టీజీఓ కార్యాలయంలో టీజేఏసీ జిల్లా చైర్మన్, కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా టీఎస్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సపావత్ బాలకృష్ణ చౌహాన్తో పాటు వివిధ సంఘాల బాధ్యులు మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగులు,ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Admin
Mana Mahati News