Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణల్లో పాల్గొని అలరించారు. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీదేవి గారు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలోపాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య గారు , చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ గారు, DGM చేతన్ గారు,ప్రిన్సిపల్ శ్రీదేవి గారు, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి తన్వీర్ గారు, ప్రైమరీ ఇన్చార్జి వినీతా గారు, డీన్ జాయబాబు గారు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News